January 31, 2013

నాలుగు రోజుల వినామానంతరం...వస్తున్నా మీ కోసం

కాలివేలి గాయంతో బాధపడుతున్న చంద్రబాబునాలుగు రోజుల విశ్రాంతి అనంతరం గురువారం తిరిగి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. చంద్రబాబు పాదయాత్ర తిరిగి ప్రారంభం కావటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం తొణికిసలాడుతోంది. బుధవారం తనను పరామర్శించడానికి వచ్చిన నాయకులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు...

కాలివేలి గాయంతో బాధ పడుతున్న చంద్రబాబు (ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి) 111 గంటల విశ్రాంతి అనంతరం గురువారం తిరిగి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం తొణికిసలాడుతోంది. చంద్రబాబు బుధవారం బిజీ బిజీగా గడిపారు. ఆయనను పరామర్శించటానికి నాయకులు క్యూ కట్టారు. చంద్రబాబును కలిసిన వారిలో యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు, కోడెల శివప్రసాదరావు, నెట్టెం రఘురామ్, దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య, తంగిరాల ప్రభాకరరావు, వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్, చిగురుపాటి వరప్రసాద్, చంద్రశేఖర్, వర్ల రామయ్య, తొండపు దశరధ జనార్ధన్‌రావు, కేశినేని నాని, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు. వారితో ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాలు, సహకార ఎన్నికలు, ఎమ్మల్సీ ఎన్నికలపై గురించి చర్చించారు. సహకార సంఘాలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవడంతో చంద్రబాబు ఆరోగ్యం మెరుగ్గా ఉందని నాయకులు చెప్పారు. మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నప్పటికీ ఆయన అంగీకరించడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆరోగ్యంను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారన్నారు.

చంద్రబాబును

పరామర్శించిన నారాయణ


సీపీఐ కార్యదర్శి కె.నారాయణ, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సీనియర్ నాయకులు సూర్యదేవర నాగేశ్వరరావు, జరబన నాగేశ్వరరావు, చుండూరు సుబ్బారావు తదితరులు చంద్రబాబును పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్యం బాగా లేదంటే బాబును చూడటానికి వచ్చాం తప్ప.. రాజకీయాలు గురించి మాట్లాడలేదని నారాయణ అన్నారు. పాదయాత్ర విజయవంతం కావాలని, చంద్రబాబు లక్ష్యం నేరవేరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై జాతీయ స్థాయిలో ఆందోళన చేస్తామని ఆయన పేర్కొన్నారు. సమస్యల గురించి వివిధ పార్టీల నాయకులతో చర్చించి జాయింట్ యాక్షన్ ప్లాన్ రూపొందించి ఉద్యమం చేపడతామని నారాయణ అన్నారు.

సమైక్యాంధ్ర కోసం

గంగాధర్ వినతిప్రతం అందజేత

విజయవాడకు చెందిన పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు బైబిల్‌ను అందచేశారు. కొరియా నుంచి తెప్పించిన బైబిల్‌కు బెంగళూరులో చర్చి ఫాదర్లతో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయించారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆధ్వర్యంలో చంద్రబాబును కల్సి పరిశుద్ధ గ్రంథాన్ని అందజేశారు. తెలుగు జాతిని దొరల దోపిడీకి, పాలెగాళ్ల దాష్టిీకాలకు, మతోన్మాదుల ఉన్మత్త చర్యలకు బలిచేయవద్దని, సమైక్యాంధ్ర రాష్ట్రమే తెలుగు జాతి ఆకాంక్షని పేర్కొంటూ పీసీసీ డాక్టర్ సెల్ మాజీ చైర్మన్ డాక్టర్ జి.గంగాధర్, చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.పట్టాభి రామ్, కార్యదర్శి కె.బిందు మాధవరావు, సభ్యులు చంద్రబాబును కల్సి సమస్యలు వివరించారు. వస్త్రలత అసోసియేషన్, విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వచ్చి వ్యాట్‌ను తప్పించటానికి సమస్యపై పోరాడాల్సిందిగా పిలుపునిచ్చారు. అలాగే స్కూల్స్ ప్రతినిధులు కూడా వచ్చి తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు.