January 31, 2013

ఇక్కడా ఓటుకు నోటు: బాబు

రాష్ట్రంలోని పేదలు, రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతే వారిని ఆదుకోడానికి చేతులు రాని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నికల్లో ఓటుకు ఇరవై నుంచి రూ.30 వేలను ఎవడబ్బా సొమ్మని ఖర్చు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. గురువారం జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓటుకు నోటు విధానాన్ని అవలంబించిందని ఆయన విమర్శించారు. డబ్బులను విచ్చల విడిగా ఖర్చు చేసి దొడ్డిదారిన సహకార సంఘాల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నించిందని విమర్శించారు.