January 12, 2013
సంచి ధర కోత విధించం: బాబుకు సీసీఐ లేఖ
పత్తి రైతులకు చెల్లించే మద్దతు ధరలో గోనె సంచు(గన్నీ బ్యాగు)ల కింద రూ.25
మేరకు కోత విధించరాదని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు సీసీఐ ఛైర్మన్, ఎండీ బీకే మిశ్రా రాసిన ఒక లేఖలో
తెలిపారు. వరంగల్ జిల్లాలో 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్ర చేస్తున్న సందర్భంగా చంద్రబాబును
కలిసిన జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధు లు.. రైతులకు చెల్లింపులో కోత గురించి
వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. 'కోత'ను నిలిపేయాలని కోరుతూ సీసీఐకి డిసెంబర్
14న లేఖ రాశారు.
Posted by
arjun
at
5:55 AM