December 21, 2012

పాదయాత్రలో పార్టీలకతీతంగా పాల్గొనాలి

ఓదెల: ప్రజల కోసం నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం.. పాదయాత్రలో పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొనాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు కోరారు. మండలంలోని పొత్కపల్లిలో బుధవారం టీడీపీ మండల కమి టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏడు గంటలపా టు విద్యుత్ సరఫరా అని పేరుకే ప్రకటిస్తుండగా, జిల్లాలో ఎక్కడ కూడా ఏడు గంటల విద్యుత్ సరఫరా లేదని ఆరోపించారు. 63 ఏటలో ఎవరూ కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సందర్భా లు లేవని, ప్రస్తుతం చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం.. పాదయాత్రను నిర్వహించడం అందరికి గర్వకారణమన్నారు. ప్రస్తుతం 1300 కిలో మీ టర్ల పాటు పాదయాత్ర కొనసాగిందని చెప్పారు.

టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలనకు బేరీజు వేసుకోవాలన్నారు. సుల్తానాబాద్ మండలంలో ఈ నెల 23న ఐతరాజ్‌పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 24న కొనసాగి, 25న ఓదెల మండలం గోపరపల్లి, కొలనూర్, కాల్వశ్రీరాంపూర్ మం డలం పెగడపల్లి, గంగారం మీదుగా, 26న ఊశన్నపల్లి, పందిల్ల, కొమిర, జీలకుంట, పొత్కపల్లికి చంద్రబాబునాయుడు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గంట రాములు, మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గోపు నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు పల్లె రాంరాజు, చీకట్ల మొం డయ్య, మండల అధికార ప్రతినిధి పడాల రాజు, మాజీ ఎంపీటీసీ సభ్యు లు నీర్ల శ్రీనివాస్, రాచర్ల రాజు, బీసీసెల్ మండల నాయకులు పెండం సమ్మ య్య, గోలి చంద్రమౌళి, పందెన నర్సిం గ్, చొప్పరి రాజయ్య, ఢిల్లీ శంకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.