December 21, 2012

జీవన్‌రెడ్డికి బాబును విమర్శించే అర్హత లేదు

టీడీపీ అధినేత చం ద్రబాబు నాయుడు 63 సంవత్సరాల వయస్సులో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తుంటే.. కొందరు నాయకులు విమర్శిస్తున్నార ని, ఆ నాయకులకు జగిత్యాలలో వచ్చి న జనమే జవాబు అని జగిత్యాల ఎమ్మెల్యే ఎల్.రమణ అన్నారు. గురువారం జగిత్యాలలోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రమణ మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్రపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నాయు డు 75 రోజులుగా పాదయాత్ర చే స్తుంటే.. అశేష జనం ఆయన వెంట ఉంటూ సమస్యలు వివరిస్తూ కంటతడి పెట్టుకుంటున్నారని, జీర్ణించుకోలే ని రాజకీయ పార్టీలు విమర్శించడం స్వార్థపూరితంతో కూడుకున్నదన్నారు. ఈర్ష్య, అసూయలతో మాట్లాడటం స రైంది కాదన్నారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం పార్టీ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పెత్తందారుల చేతిలో ఉండే రాజ్యాధికారాన్ని బలహీన వర్గాలకు అందింపజేశాడన్నారు.

చంద్రబాబు నాయుడు చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఆదా యం పెరుగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం పేరిట అందినంత దోచుకుందని విమర్శించారు. అధికారంలో ఉం ది అని ఆ పార్టీలో ఉంటూ పనులు చే యించుకుంటూ, మరో పార్టీ నాయకుడు సీఎం అవుతాడంటూ జగన్ జ పం చేస్తున్న జీవన్ రెడ్డికి బాబును వి మర్శించే అర్హత లేదన్నారు. ఎవరి పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలుసని.. అవినీతి, అక్రమాలు లేకుండా పని చేస్తున్నానని, ఎవరి కోసం పనులు మం జూరీ చేయించారో, ఎవరికి కాంట్రాక్ట్‌లు ఇచ్చారో మాట్లాడుకుందామని సవాల్ విసిరారు. వరద కాలువ నిర్మాణంలో టీడీపీ కి.మీ.కు 6 కోట్లు కేటాయిస్తే, వైఎస్ఆర్ కి.మీ. 13 కోట్లకు పెంచారని, వరద కాలువ నిర్మాణం త ర్వాత ఎవరికి ఏ వాహనాలు వచ్చా యి.. ఎవరి ఆస్తులు పెరిగాయో జగిత్యాల టవర్ వద్ద చర్చించి అక్రమ ఆ స్తులు ఉంటే ప్రజలకు రాసిద్దామని డిమాండ్ చేశారు.

ఆర్డీఓ కార్యాలయం ముందు ప్రజా సమస్యలను వివరించేందుకు వచ్చినవారితో వచ్చి ఫోటో లు దిగే నీవా చంద్రబాబు గురించి మాట్లాడటం అంటూ విమర్శించారు. బాబులాంటి వ్యక్తిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాబ్రీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు తాను, టీడీపీ ఎమ్మెల్యేలంతా ఆందోళన వ్యక్తం చేస్తే అప్పుడు అధికారంలో ఉన్న జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులాంటివారు తప్పు పట్టారని ఆరోపించారు. 18 గ్యారేజీలు నిర్మించడంతో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారబోతుందని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కూడా రోడ్లను శుభ్రం చేయడం సరైంది కాదన్నారు. రాయికల్‌లో టీఆర్ఎస్ బంద్‌కు పిలుపునిస్తే ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు తెరిచి బాబుకు సంఘీభావం తెలిపారని అన్నారు. ప్రజా సమస్యలపై అక్రమాలు తెలుసుకునేందుకు తప్పకుండా డిబెట్ చేద్దాం.. తప్పేమీ లేదని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు గట్టు సతీష్, రాంచందర్ రావు, సత్యనారాయణ రావు, బాలె శంకర్, వొల్లం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.