November 9, 2012

వస్తున్నా...మీకోసం పాదయాత్రకు ఎన్నారైలు మద్దతు



టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా...మీకోసం పాదయాత్రకు ఎన్నారైలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నారై టీడీపీ కనెక్టికట్ మద్దతుదారులు మాంచెస్టర్‌లోని నార్త్‌వెస్ట్ పార్క్ వద్ద దాదాపు 200 మందితో సంఘీభావ సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆంద్రప్రదేశ్ నుంచి టీడీపీ నేతలు కోడెల శివప్రసాదరావు, దేవినేని ఉమా, పయ్యావుల కేశవులు హాజరై పాదయాత్రకు ఎన్నారైల మద్దతుపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నార్త్‌జోన్ పార్క్ చుట్టూ తెలుగుదేశం పార్టీ బ్యానర్లు, బ్యాడ్జీలు, కండువాలు, చంద్రబాబు- ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో పాదయాత్ర చేశారు. 100 కార్లతో జైతెలుగు దేశం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం అంటూ నినాదాలు చేస్తూ పార్క్ చుట్టూ ర్యాలి నిర్వహించారు.

అనంతరం చంద్రబాబు పాదయాత్రపై పలువురు ప్రసంగించారు. పెద్ద ఎత్తున ప్రజలు సదస్సుకు హాజరై విజయవంతం చేసినందుకు ఎన్నారై టీడీపీ కనెక్టికట్ సభ్యులు శ్రీనివాస్ యండూరి, తరణి పరచూరి, గోపాల కృష్ణ (గోపి), యోగేష్ అబ్బురి, శ్రీనివాస్ అట్లూరి, రామకృష్ణ ఇంతూరి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

అదే విధంగా ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత ఎర్రన్నాయుడు సంతాపసభ నిర్వహించడంతో పాటు, దారుణ హత్యకు గురైన చిన్నారి శాన్వికి క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
No comments :

No comments :