November 9, 2012
600 కిలోమీటర్ల మైలురాయిని దాటిన చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర 8.11.2012
'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర
చేపట్టిన చంద్రబాబు గురువారం సాయంత్రం 600 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. పాలమూరు
జిల్లా కొత్లాబాద్కు చేరుకోగానే ఆయనీ మైలురాయిని అధిగమించారు. అక్టోబర్ 2న పాదయాత్ర
ప్రారంభించిన బాబు.. అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు,
6 మునిసిపాలిటీలు, 31 మండలాలు, 280 గ్రామాల్లో పర్యటించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ
సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దన్ చెప్పారు. మూడు జిల్లాల్లో కలిపి 178 మందికి వ్యక్తిగతంగా
రూ.6.76 లక్షల మేరకు ఆర్థిక సాయం చేశారని వెల్లడించారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment