October 24, 2012

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి చికిత్స చేయాల్సిన అవసరం,పది వంట గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ -చంద్రబాబు

తాము అధికారంలోకి వస్తే పది వంట గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రటించారు. ఆయన చేపట్టిన పాదయాత్రలో భాగంగా బుధవారం పాలమూరు జిల్లా ఐజలో భారీగా హాజరైన స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ఆరు వంట గ్యాస్ సిలిండర్లను మాత్రమే సబ్సిడీకి పంపిణీ చేస్తామని చెపుతోందని, తాము అధికారంలోకి వస్తే పది సిలిండర్లను సబ్సిడీ కింద పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సబ్సిడీ అన్ని వర్గాల వారికి అందేలా చూస్తామన్నారు.

ఇకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు తనకు వినతిపత్రం సమర్పించడానికి వచ్చిన బీఈడీ విద్యార్థులతో మాట్లాడుతూ.. బీఈడీ అభ్యర్థులు తన వెంట వస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని వారికి హామీ ఇచ్చారు.
No comments :

No comments :