September 12, 2013

45 రోజులుగా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడుపుతున్నారు...............

దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఓ కీలు బొమ్మలా మారారని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. 45 రోజులుగా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడుపుతున్నారని ఆయన అన్నారు. సరైన పాలన కోసం ప్రజలు చంద్రబాబు వైపు చూస్తున్నారని తలసాని పేర్కొన్నారు.