September 12, 2013

పార్టీ నేతలతో ముగిసిన చంద్రబాబు సమావేశం

విభజన తర్వాత రాష్ట్ర నెలకొన్న పరిస్థితులపై పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన నివాసంలో జరిపిన సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు కాంగ్రెస్సే కారణమనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై మరోసారి సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నట్లు ఆ పార్టీ నేత సోమిరెడ్డి తెలిపారు.