October 25, 2012

బాబు పాదయాత్ర విజయ వంతం కావాలని మౌలాలి దర్గా వద్ద ముస్లీం సోదరుల ప్రార్ధనలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ గురువారం మౌలాలి దర్గా వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మౌలాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జవహర్‌నగర్, కమాన్ బస్తీ నుంచి దర్గా వరకు ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా తరలి వెళ్లారు.

అనంతరం దర్గా మెట్ల సమీపంలోని ఛిల్లా వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటి నాయకులు, కార్యకర్తలంతా కలిసి సెహరా సమర్పించారు. ప్రజల సమస్యలు, సాధక బాధలు నేరుగా తెలుసుకోవడం కోసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్నట్లు ఆ పార్టీ మల్కాజిగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జి వీకె మహేష్ ముదిరాజ్, మౌలాలి డివిజన్ అధ్యక్షుడు మేకల మోహన్‌యాదవ్‌లు చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు పాదయాత్ర తెలంగాణ జిల్లాలో మరింత జయవప్రదం కావాలని ఆకాంక్షించారు
No comments :

No comments :