September 11, 2013
సీఎం కిరణ్ లీకుల వీరుడు...బొత్స ఉత్సవ విగ్రహం...
కాంగ్రెస్ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోంది : చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఉదయం కృష్ణా జిల్లా
గాదెవారిపేటలో బాబు 11వ రోజు ఆత్మగౌరవయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ మన్మోహన్ ఓ అసమర్థ ప్రధాని అని, సోనియా చేతిలో ప్రధాని
రిమోట్కంట్రోల్ లాంటివారని ఆయన విమర్శించారు.
దేశానికి, రాష్ట్రానికి సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.
సీఎం కిరణ్ లీకుల వీరుడని...బొత్స ఉత్సవ విగ్రహం మాత్రమే అని బాబు
ధ్వజమెత్తారు. మరో నాయకుడు ఎప్పుడూ జైల్లోనే ఉంటాడని, వీరి వల్ల ఒరిగేది
ఏమీ లేదని బాబు అన్నారు. టీడీపీ హయాంలో గ్రామగ్రామాన నాయకుడు
పుట్టుకొస్తాడని బాబు తెలిపారు.
సమైక్యాంధ్ర కోసం 42 రోజులుగా ఉద్యమిస్తున్నా సీమాం«ద్రులను పట్టించుకునే
నాథుడే లేడని, సీమాం«ద్రుల హక్కుల కోసం పోరాడుతామని ఆయన చెప్పారు. అన్ని
రాజకీయపార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. సమస్య పరిష్కారం
చేయమంటే కాంగ్రెస్ మరిన్ని సమస్యలను సృష్టిస్తోందని చంద్రబాబు
మండిపడ్డారు.
Posted by
arjun
at
2:34 AM