September 11, 2013

వైఎస్సే భయపడేవాడు ....గట్టిగా మాట్లాడితే మీ అంతు చూస్తాం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆత్మగౌరవ బస్పు యాత్రలో వైసిపి కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బాబు ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా బుధవారం కృష్ణా జిల్లా వావిలాల గ్రామంలో చంద్రబాబు ప్రసంగించేందుకు వస్తుండగా అక్కడ ఉన్న వైసిపి కార్యకర్తలు సమైక్యాంధ్ర నినాదాలతో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి యత్నించారు.
రైతులకు నన్ను నిలదేసే హక్కు ఉందని, దొంగలకు మాత్రం తనను ప్రశ్నించే హక్కులేదని ఆయన వైసిపి కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేం తలుచుకుంటే వైసిపి నేతలు ఇంట్లో నుంచి బయటకు రాలేరని,
తనకు వైఎస్సే భయపడేవాడని,  అని చంద్రబాబు నాయిడు వైసిపి కార్యకర్తలను హెచ్చరించారు.
దీంతో ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు, వైసిపి కార్యకర్తలను అడ్డుకున్నారు. అంతటితో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇది చూసిన బాబు వైసిపి కార్యకర్తలను నిలువరించారు. "పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఉరుకోం'' అంటూ బాబు వైసిపి కార్యకర్తలపై నిప్పులు చెరిగారు.
జగన్ బెయిల్ కోసం కాంగ్రెస్‌తో లాలూచి పడి నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తూ అసలు తెలంగాణకు బీజం వేసింది వైఎస్ అని బాబు ధ్వజమెత్తారు. జైల్లో ఉన్నా మీ నాయకుడికి సిగ్గు రాలేదు, నర్సీపట్నంలో దొంగనోట్లు ముద్రించి, ఎటిఎంలు దోచి షర్మిల పాదయాత్రలకు ఖర్చుపెట్టారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈలోగా ఘర్షణకు దిగిన వైసిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అక్కడి నుండి పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది.