September 10, 2013

రేపు ముగియనున్న తొలి విడత బాబు ఆత్మగౌరవ యాత్ర

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చేపట్టిన మొదటి విడత ఆత్మగౌరవ యాత్ర బుధవారం రాత్రితో ముగియనుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గుంటూరు జిల్లాలో ప్రారంభిన ఆత్మగౌరవ యాత్ర కృష్ణా జిల్లా తిరువూరులో రాత్రి ముగుస్తుంది. రేపు యాత్ర ముగియగానే చంద్రబాబు హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.
నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండో విడత ఆత్మగౌరవ యాత్ర షెడ్యూల్‌ను చంద్రబాబు ప్రకటిస్తారు. ఈ లోపల ఒకసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లివస్తారు. పశ్చిమగోదావ
రి జిల్లా ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఎన్ని రోజులు జరుగుతుంది. విధి విధానాలను త్వరలో ప్రకటిస్తారని తెలియవచ్చింది. ఆత్మగౌరవ యాత్రంలో చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది,