September 8, 2013

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారే

సీమాంధ్రలో 60 లక్షల ఎకరాల ఆయకట్టు వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతోంది. రాష్ట్రాన్ని విడదీస్తే నీరు అందక ఏడారిగా మారిపోతుందని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని జిల్లా తెలుగురైతు అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, రైతులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విన్నవించారు. ఆత్మగౌరవ యాత్రలో ఆయనను కలసి.. విభజిస్తే ఇక్కడ ఉత్పన్నమయ్యే సమస్యల గురించి వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కించి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో పూర్తిస్థాయిలో నీరు ఉన్నా ఇప్పటికీ ప్రకాశం బ్యారేజీకి నీరు రాని పరిస్థితి ఉందన్నారు. వర్షాలు పడుతున్నా ఇప్పటికీ 30 శాతం వరినాట్లు పడలేదని చంద్రబాబుకు వివరించారు. అలాగే కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులను పూర్తి చేసి, చివరి ప్రాంతాలకు సాగునీరు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబను కోరారు. రైతులకు పంట బీమా, మిర్చి, ప్రత్తికి గిట్టుబాటు ధరను కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మీకు న్యాయం చేస్తాను: చంద్రబాబు
రైతులు విన్నపాలపై చంద్రబాబు స్పందిస్తూ ఒకరికి న్యాయం చేయమం టే మరోకరికి పాలకులు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏధైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటారు. కానీ కాంగ్రెస్ ఇవేవీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందున్నారు. సీమాం«ద్రుల హక్కుల్లో నీటి సమస్య కూడా ఒక భాగమన్నారు. మీ సమస్యలన్నింటిని పరిష్కరించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
భక్షి సిఫార్సులపై
చంద్రబాబుకు వినతి పత్రం
కో ఆపరేటివ్ సొసైటిల మనుగడ ప్రశ్నార్థకంగా మారే డాక్టరు ప్రకాష్ బక్షి సిఫార్సులను వ్యతిరేకించి రైతాంగానికి న్యా యం చేయాలని చలసాని ఆంజనేయులు, చంద్రబాబుకు సూరంపల్లిలో వినతిపత్రాన్ని అందజేశారు. ఆస్తులు, అప్పులు, షేరుధనం, బదలాయించడం వల్ల వివిధ సంఘాల నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. రైతుల కోసం గ్రామీణ స్థాయిలో ఏర్పడిన సంఘాలు ప్రైవేటీకరణ జరిగే అవకాశం ఉంది. బక్షి కమిటీ నివేదిక అమలు నిలుపుదలకు కృషిచేయాలని వినతి పత్రంలో కోరారు.