September 8, 2013

కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి ఉద్యమంలోపాల్గొనండి:సోమిరెడ్డి

సీమాంధ్ర కేంద్ర మంత్రులు తక్షణమే రాజీనామాచేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని టీడీపీ నేత, మాజీ మంత్రి
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండు చేశారు. తిరుమలలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభను దిగ్విజయంగా నిర్వహించిన ఏపీ ఎన్జీవోల జేఏసీ చైర్మన్ అశోక్‌బాబును అభినందిస్తున్నానన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు పునరాలోచించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన పాలనను గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని సోమిరెడ్డి సూచించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి జానారెడ్డి తమ అనాలోచిత ప్రసంగాలతో రాష్ట్రాన్ని చిందరవందరగా చేస్తున్నారని ఆయన విమర్శించారు.