August 6, 2013

ఆంధ్రకు న్యాయం కావాలంటూ తెలుగు దేశం సభ్యుల నినాదాలు

తెలంగాణ అంశం మంగళవారంనాడు రాజ్యసభను కుదిపేసింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో సభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ ఒక దశలో దేశం ఎంపీ సీఎం రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు సోమవారంనాడు కూడా రాజ్యసభలో ఇలాగే నినాదాలు చేయడంతో సభాకార్యక్రమాలు సరిగా జరగలేదు. వరుసగా రెండవ రోజు కూడా ఇలాగే జరగడంతో సభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ అసహనం వ్యక్తం చేశారు.
మీమీద చర్య తీసుకునేవరకూ తెచ్చుకోకండి అని
రాష్ట్ర విభజన అంశం సభలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మీరు మీ అభిప్రాయాలను వెల్లడించవచ్చునని సభ ఉపాధ్యక్షుడు తెలుగుదేశం సభ్యులకు నచ్చజెప్పడానికి యత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ తెలుగుదేశం సభ్యులు సభ మధ్యకు వెళ్లి నినాదాలు కూడా చేశారు. సభ ఉపాధ్యక్షుడు ఇది పద్ధతి కాదని పదేపదే చెప్పి చూశారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు.
కూడా ఒక దశలో కురియన్ హెచ్చరించారు. అయితే సీఎం రమేశ్, చౌదరి వినిపించుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం జరగాలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడండి అంటూ వారు నినాదాలు చేశారు.