August 6, 2013

టిడిపి ఎమ్.పిల నినాదాలు-రాజ్యసభ వాయిదా

తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సి.ఎమ్.రమేష్, సుజనా చౌదరి లు రాజ్యసభలో ఆందోళనకు దిగడంతో రాజ్యసభ వాయిదా పడింది.జై ఆంధ్ర ప్రదేశ్ అంటూ , తమకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు.ఉత్తరాఖండ్ వరదల తర్వాత తెలంగాణ అంశంపై చర్చ తీసుకుంటామని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ప్రకటించినా ,టిడిపి ఎమ్.పిలు శాంతించ లేదు.దాంతో రాజ్యసభ పదిహేను నిమిషాలపాటు వాయిదా పడింది. కాగా లోక్ సభలో స్పీకర్ విజ్ఞప్తి మేరకు సీమాంధ్ర ఎమ్.పిలు ఆందోళన విరమించారు.వారు. గులాం నబీ అజాద్, చిదంబరంలతో భేటీ అవుతున్నారు.