July 23, 2013

ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఎన్నికల కోడ్‌ అతిక్రమించినందుకు గాను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ విషయమై టిడిఎల్పీ ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు సోమవారం ఎన్నికల కమీషనర్‌ రమాకాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తొలివిడత పంచాయతీ ఎన్నికలు మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో బొత్స మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఏకగ్రీవ ఎన్ని కల్లో తమ పార్టీదే పైచేయని చెప్పటం ఓటర్లను ప్రభావితం చేసేదిగా ఉందన్నారు. ఎన్నికల నియ మావళిని అనుసరించి ప్రభుత్వపరంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం తగదన్నారు. వరద బాధిత రైతాంగానికి ప్రభుత్వపరంగా ఆదు కుంటామని సబ్సిడీపై విత్తనాలు అందజేస్తామని హామీ ఇవ్వటం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన క్రిందకు వస్తుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలపై విశ్లేషణ జరుపుతూ ప్రభుత్వపరంగా వాగ్దానాలు చేసినందుకు బొత్సపై కోడ్‌అతిక్రమణ క్రింద చర్యలు తీసుకోవాలని కోరారు.