July 23, 2013

తెదేపా పాలనే స్వర్ణయుగం

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలననే స్వర్ణయుగమని టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి
రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నా రు. సోమవారం ఆయన కోమాలోకి వె ళ్లిన ఇమామ్ హుస్సేన్ కుటుంబ స భ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వీరారెడ్డి హయాం నుండి ఇమామ్ హు స్సేన్‌కు పలువురితో స్నేహముందని, ఇమామ్ హుస్సేన్ అస్వస్థతకు గురికావడం బాధాకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా మద్ధతుదారులే అత్యధికస్థానాల్లో విజయం సాధిస్తారన్నారు.
ప్రస్తుతం కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, చం ద్రబాబు హయాంలో కరవు కాటకాల్లో కూడా 9 గంటలు విద్యుత్తును అందించారన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు అధికారం చేపట్టడం తధ్యమని జోస్యం పలికారు. బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ మద్ధతుదారులు ఎక్కువస్థానాలు కైవసం చేసుకుంటారన్నారు.