July 23, 2013
`దేశం` నజర్
మెజార్టీ పంచాయితీల్లో పాగ
వేసేందుకు ప్రయత్నాలు
ఏకగ్రీవాల స్ఫూర్తితో దూకుడు
టీడీపీ హయాంలో స్థానిక
సంస్థల బలోపేతం
సుపరిపాలన `దేశం'తోనే సాధ్యం
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జరగనున్న తొలి విడత
పంచా యితీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెల్చుకు నేందుకు తెలుగుదేశం
పార్టీ పావులు కదుపు తోంది. పంచాయితీ ఎన్నికలను మొదటి నుండి ఆ పార్టీ
నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మూడు దశల్లో జరిగే
పంచాయితీ ఎన్నికల్లో అందివచ్చే ఎటువంటి అవకాశాలను జారవిడుచుకోవద్దని టీడీపీ
నాయ కత్వం భావిస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో విజ యం ద్వారా పార్టీ
శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపాలని అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పంచాయితీల్లో పాగ వేసేందుకు అవలంభించాల్సిన
వ్యూహంపై ఇప్పటికే ఆయన ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ బలపర్చిన
సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే సుపరిపాలన అందించే బాధ్యత తానే తీసుకుం
టానని ఇప్పటికే చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు
మాట్లాడు తూ స్థానిక సంస్థల బలోపేతానికి టీడీపీ ఎంతో కృషి చేసిందని
పేర్కొన్నారు. టీడీపీ హయాంలో సర్పంచ్లకు 64 అధికారాలు కట్టబెడితే,
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వారి వద్ద నుండి 58 అధికారాలను
లాగేసుకుందని విమర్శించారు. సర్పంచ్లకు నిధులు, విధులిచ్చి పల్లెసీమల
అభివృద్ధి టీడీపీ అంకితభావంతో పని చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం వల్లే పల్లెలిప్పుడు సమస్యల సుడిగుండంలో
కొట్టుమిట్టాడుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు
సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల పల్లెసీమల అభివృద్ధిని పట్టించు
కున్న నాథుడే లేరని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి
సమస్య తీవ్రంగా ఉందన్న బాబు, వీధుల్లో విద్యుత్దీపాలు, పారిశుధ్య సమస్యలు
సైతం తీవ్రరూపం దాల్చాయని మండిపడ్డారు.
ఈసారి పంచాయితీ ఎన్నికల్లో
నిజాయితీప రులు, సమర్ధులైన అభ్యర్థులను గెలిపించాలని ఆయన రాష్ట్ర ప్రజలను
కోరారు. సమర్థులను ఎన్నుకోవడం ద్వారానే గ్రామాభివృద్ధి సాధ్యమని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరగనున్న పంచాయితీల్లో సత్ఫలితాలు
సాధించేందుకు టీడీపీ నాయకత్వం వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తోంది. పోలింగ్
జరగనున్న గ్రామాల్లో ఆయా ప్రాంతాల ముఖ్యనేతలను ఇప్పటికే మొహరించారు.
అభ్యర్థుల తరుపున అన్ని తామై అయి వ్యవహరించాలని ఆదేశించారు. పార్టీ
ప్రకటించిన ఎస్సీ, బీసీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల
వంటి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని
చేయాలన్నారు. ఎన్నికలకు ముందే జరిగిన ఏకగ్రీవాల్లో అత్యధిక స్థానాలు
గెల్చుకున్న టీడీపీ, మూడు దశల్లో జరగబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు
ఊవ్విళ్లూరు తోంది. ఏకగ్రీవాలపై ఎవరి వాదన ఎలా ఉన్నా అధికార కాంగ్రెస్
పార్టీకి, టీడీపీ ధీటైన జవాబిని చ్చిందనీ రాజకీయ పరిశీలకులు అంచనా
వేస్తున్నారు. అధికారం అండతో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాల్లో అత్యధిక
స్థానాలు గెల్చుకోగలిగినా, టీడీపీ సైతం ధీటుగా 736 స్థానాలు గెల్చుకు
న్నతీరును బట్టే మూడు దశల్లో జరగనున్న ఎన్నికల పరిస్థితిని
విశదీకరిస్తోందని వ్యాఖ్యాని స్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్,
టీడీపీ నువ్వా, నేనా అన్నట్లు తలపడడం ఖాయమని వారు పేర్కొంటున్నారు. స్థానిక
సంస్థలకు జరిగే ఎన్నికలు కావడంతో స్థానిక అంశాలు సైతం గెలుపుకు దోహదం
చేస్తాయంటూనే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాలు గెలవగలితే ఆ పార్టీల
మనోస్థైర్యం రెట్టింపుకావడం ఖాయమని పేర్కొంటున్నారు. రెండు దఫాలుగా
అధికారానికి దూరమైన టీడీపీ నాయకత్వం పంచాయితీ ఎన్నికల పునాదులపైనే రానున్న
సాధారణ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నేడు
జరగనున్న తొలి దశ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పరిశ్రమిస్తోంది.
Posted by
arjun
at
1:34 AM