June 22, 2013

విజయవాడను గ్రేటర్ సిటీగా ప్రకటించాలి: టిడిపి

నగరాన్ని గ్రేటర్ సిటీగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టిడిపి మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... విజయవాడను గ్రేటర్ సిటీగా మారుస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకూ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నగర అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గ్రేటర్ సిటీ అయితే.. కేంద్ర ప్రభుత్వ నిధులు అందుతాయని, తద్వారా మురికివాడల అభివృద్ధి, ట్రాఫిక్ వంటి సమస్యల నివారణకు ఆస్కారం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల నిర్లక్ష్యం వల్లే విజయవాడ గ్రేటర్ సిటీ కాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.