June 22, 2013

'కాగ్'నూ టార్గెట్ చేస్తారా ? : యనమల

'ధనయఙ్ఞంగా మారిన జలయఙ్ఞంపై తెలుగుదేశం పార్టీ మొదటినుంచీ చెబుతున్నదే కాగ్ కూడా బయటపెట్టింది. టీడీపీ చెప్పేవి నిజాలేనని రుజువైంది. కరప్షన్ కింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిపై మేం వేసిన పుస్తకంలోని అంశాలు వాస్తవాలేనని సీబీఐ విచారణలో రుజువవుతోంది. ఇక ఇప్పటిదాకా సీబీఐని, కోర్టులను నిందించిన సాక్షి మీడియా, వైసీపీ నేతలు ప్రస్తుతం కాగ్‌ను కూడా నిందించడం హేయం' అని టీడీపీ శాసనమండలిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ అవినీతిని బయటపెట్టిన వ్యవస్థల నైతికతనే దెబ్బతీయడంద్వారా ప్రజలో అపోహలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తోందని యనమల ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.