June 3, 2013

సకల జనుల సమ్మెను అమ్ముకున్న కేసీఆర్



హైదరాబాద్, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు సకల జనుల సమ్మెను అమ్ముకున్నారని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. సమ్మెను మరో వారం రోజుల పాటు కొనసాగిస్తే తెలంగాణ వచ్చేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వనరులను కాంగ్రెస్ దోచుకుపోతుంటే కేసీఆర్ ఏం చేశారని ఎర్రబెల్లి సూటిగా ప్రశ్నించారు. టిడిపిని విమర్శిస్తున్న సోనియా, రాహుల్ గాంధీలను ఆయన ఎందుకు విమర్శించటం లేదని సూటిగా అడిగారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉందని ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణపై త్వరలో అన్ని జిల్లాల్లో టీడీపీ తెలంగాణ ఫోరం సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.