May 21, 2013

వచ్చేది టీడీపీ సర్కారే : లోకేష్‌



మహబూబ్‌నగర్‌ : వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తనయుడు లోకేష్‌బాబు అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే యువత, పిల్లల భవిష్యత్‌ ఆందోళనకరంగా మారుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ అవినీతికి భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కొత్తకోటలో ఏర్పాటు చేసిన మినీ మహానాడు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.