May 21, 2013
వచ్చేది టిడిపి సర్కారేనన్న చినబాబు !
కొత్తకోట: మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తకోటలో ఏర్పాటు చేసిన మినీ మహానాడు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ఉద్వేగంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే యువత, పిల్లల భవిష్యత్ ఆందోళనకరంగా మారుతుందని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ అవినీతికి భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలా మరికొంత కాలం కొనసాగితే పారిశ్రామిక వేత్తలు మన మన రాష్ట్రాన్ని పూర్తిగా మరిచిపోతారు. మన రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Posted by
arjun
at
6:34 AM