May 11, 2013
కడియం పార్టీ వీడినా నష్టం లేదు : రేవూరి
హైదరాబాద్: సీనియర్ నేత కడియం శ్రీహరి టీడీపీని వీడి నా ఎలాంటి
నష్టం లేదని టీడీపీ నేత రేవూరి ప్రకాష్రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం
ఏబీఎన్తో ఆయన మాట్లాడుతూ కడియంకు కార్యకర్తల మద్దతు లేదని విమర్శించారు.
కడియం పార్టీ వీడుతారని ముందే తెలుసని, కేసీఆర్ స్క్రిప్టును కడియం
చదివారని ఆరోపించారు. టీడీపీ ప్రజల పార్టీ, కార్యకర్తల పార్టీని అని ఆయన
స్పష్టం చేశారు. కడియం పార్టీ మారడం రాజకీయ వ్యభిచారం అని రేవూరి
ప్రకాష్రెడ్డి వ్యాఖ్యానించారు.
Posted by
arjun
at
7:13 AM