May 11, 2013

టీడీపీ నుంచి ఎవరు పోయిన నష్టం లేదు : ఎర్రబెల్లి

హైదరాబాద్

టీడీపీ వల్లే కడియం శ్రీహరికి గౌరవం పెరిగిందని, స్వార్థం కోసమే పార్టీని వీడారని ఆరోపించారు. కడియం పోయినా పార్టీని కార్యకర్తలు వీడటం లేదని వెల్లడించారు. టీడీపీపై, చంద్రబాబుపై అబాంఢాలు వేయడాన్ని కడియం విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. తెలంగాణ అంశంపై కడియంతో అనేక సార్లు మాట్లాడానని, అయినా రాజీనామా నిర్ణయం తొందరపాటు చర్య అని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.
: టీడీపీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం ఏమీ లేదని టి.టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. శనివారం ఉదయం కడియం రాజీనామా నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై అధినేత చంద్రబాబుతో ఎర్రబెల్లి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్లి పోయిన వారే నష్టపోయారన్నారు. ఎంతో మంది సీనియర్ నేతలు పార్టీని వీడి మరలా తిరిగి వచ్చారని గుర్తు చేశారు.