May 11, 2013

రాజకీయ లబ్ది కోసమే పార్టీ వీడారు : మోత్కుపల్లి

హైదరాబాద్
: కడియం శ్రీహరి రాజీనామా ఊహించిందే అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కడియం రాజీనామా చేసినా పార్టీకి నష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే పార్టీ వీడారని ఆరోపించారు. తెలంగాణవాదినని చెప్పుకునే కడియం తెలంగాణపై టీడీపీ లేఖలో ఏం లేకుంటే అఖిలపక్షానికి ఎందుకు వెళ్లారని కడియంను మోత్కుపల్లి ప్రశ్నించారు.