March 12, 2013

ఒట్టేసి చెబితేనే మద్దతు: రేవంత్

హైదరాబాద్ : భవిష్యత్తులో కాంగ్రెస్‌లో విలీనం కాబోమని ప్రమాణం చేస్తే టీఆర్ఎస్, వైసీపీలు పెట్టే అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధమేనని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. "టీఆర్ఎస్, వైసీపీ వైఖరిపై మాకు చాలా అనుమానాలున్నాయి. ఒకపక్క కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తూ మరోపక్క అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనలు తెస్తున్నాయి. అందుకే ప్రమాణం చేయమంటున్నాం. భవిష్యత్తులో ఏనాడూ కాంగ్రెస్‌తో చేతులు కలపబోమని, మద్దతు ఇవ్వబోమని తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాల వద్ద కేసీఆర్.. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ప్రమాణం చేయాలి. అప్పుడు నిరభ్యంతరంగా మద్దతిస్తాం'' అని ఆయన వివరించారు.