January 20, 2013

'వైఎస్ అవినీతికి కోమటిరెడ్డి బ్రదర్స్ మచ్చుతునక'

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోమటిరెడ్డి బద్రర్స్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. వారి వ్యవహారశైలిని ఎండగట్టారు... వైఎస్ జమానాలో అవినీతికి వారు మచ్చుతునకలు గా పేర్కొన్నారు. వారి ముగ్గురి అవినీతిని విక్రమార్కుడు, భేతాళుడు కథ రూపంలో పలు సభల్లో వివరించి ప్ర జలను ఆకట్టుకున్నారు. పాదయాత్ర మూడోరోజు, శనివారం ఆయన పలుసభల్లో మాట్లాడుతూ 'ఈ ఇద్దరు సో దరుల్లో ఒకరు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. మరొకరు ఎంపీ... వారికి సు శీ హైటెక్ అనే అర్హతలేని కంపెనీ ఉం ది.

రాజావారు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరవా..! అన్నట్టు వైఎస్ రా జశేఖర్‌రెడ్డి అర్హత, గిర్హత పక్కనపెట్టి సుశీ కంపెనీకి రూ. 2,600కోట్ల విలువై న పనులు కట్టబెట్టారు. అందులో రా జావారికి రూ.200 కోట్లు ముడుపులు ముట్టాయి. రూ.300 కోట్లకు మిడ్‌మానేరు డ్యాం మట్టిపని చేపట్టి రూ.100 కోట్లు మిగుల్చుకున్నారు. రూ. 750 కో ట్ల విలువైన చేవెళ్ల - ప్రాణహిత ప్రాజె క్టు పనులకు సంబంధించి అడ్వాన్సు లు తీసుకుని పనిచేయడం లేదు' చం ద్రబాబు ఆరోపించారు. తమ అవినీతి సంపాదనలో 10 శాతం ఖర్చు పెడితే గెలుస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. వైఎస్ జమానాలో పెంచి పోషించిన అవినీతికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక మ చ్చుతునకగా ఆయన అభివర్ణించారు.

సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వడంలేదని, ఏమైనా తమాషాగా ఉం దా... అంటూ నీరు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చంద్రబా బు హెచ్చరించారు. నీరు, విద్యుత్ ఇ వ్వలేని ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మనం మౌనం గా ఉంటే ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ పోతాయని హెచ్చరించారు. లంబాడ భాష నేర్చుకోవాలని ఉందని, నెలరోజులు మీ మధ్య ఉంటే ఆ భాష నేర్చుకుంటానని సీత్లాతండా వాసుల తో చంద్రబాబు అన్నారు. ఒక పక్క సా గర్ నీళ్లు రాక, మరోపక్క కరెంట్‌లేక పంటలన్నీ ఎండిపోయాయని, ఆత్మహత్యలు తప్ప మరోమార్గం లేదని రై తులు అంటుంటే గుండె కదిలిపోతోందని టీడీపీ అధినేత వాపోయారు.

రా ష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలుగా నరకాసుర పాలన సాగుతోందనిన్నారు. యూరియా కోసం పోలీస్‌స్టేషన్‌కు వె ళ్లాల్సిన దుస్థితని, గట్టిగా డిమాండ్ చే స్తే లాఠీ దెబ్బలు రుచిచూపిస్తున్నారని దుయ్యబట్టారు. కరెంట్ ఎప్పుడు వ స్తుందో, ఎప్పుడు పోతుందో కాంగ్రెస్ దొంగలకే తెలుసని వ్యాఖ్యానించారు. 'కొత్తగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే రూ. ఏడువేలు చెల్లించాల్సిన దౌర్భా గ్యం. కేంద్రం పెన్షన్‌ల కింద రూ. 400 ఇస్తే కిరికిరి రెడ్డి రూ. 200 ఇస్తూ మరో రూ. 200నొక్కేస్తున్నారు' అని ఆరోపించారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గా ఉన్న సమయంలో నారాయణపు రం గ్రామానికి వచ్చి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు ఇం కా గుర్తుందన్నారు.

నారాయణపురం గ్రామం టీడీపీకి కంచుకోటని కితాబిచ్చారు.

త న హయాంలో చక్కెర ధర రూ.20 ఉండగా ప్రస్తుతం అది 80కు చేరిందని, అన్ని రేట్లు హెచ్చడంతో పండుగలకు పిండి వంటలు చేసే పరిస్థితి లే కుండాపోయిందన్నారు. ఒక్క కుటు ంబంలో పెద్ద కొడుకు స్థిరపడితే ఆ కు టుంబం అంతా ఎంతో ఆనందంగా ఉ ంటుందని, అదే రీతిలో మీరు ఆదరిం చి గెలిపిస్తే పెద్ద కొడుకుగా ఉండి మీ రుణం తీర్చుకుంటానని చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో 11సార్లు డీఎస్సీ వేసి వేల ఉద్యోగాలు ఇస్తే, కాం గ్రెస్ హయాంలో రెండు సార్లు మాత్ర మే డీఎస్సీ నిర్వహించారని విమర్శించారు.