January 3, 2013
9 నాటికి యాత్రకు వంద రోజులు!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన
పాదయాత్ర ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి వంద రోజులు పూర్తి చేసుకోనుంది. అక్టోబర్ రెండో
తేదీన చంద్రబాబు అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ నెల ఎనిమిదో తేదీతో ఆయన వరంగల్ జిల్లాలో తన పర్యటన పూర్తి చేసుకొని ఖమ్మం జిల్లాలో
అడుగు పెట్టనున్నారు. ఆ జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తిరుమలాయ పాలెం మండలంలో చంద్రబాబు
వందో రోజు పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు నిర్వహించాలని
టీడీపీ వర్గాలు యోచిస్తున్నాయి.
పాదయాత్ర వంద రోజులకు చేరుకున్న సందర్భాన్ని స్ఫురింపచేస్తూ రాష్ట్రమంతటా
వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికోసం ఎక్కడికక్కడ
స్థానిక నేతలు ముందుకు వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దాంతోపాటు.. ఈ నెల
11న పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కాగా.. 'పల్లె పల్లెకూ
తెలుగుదేశం' నిర్వహణలో వెనకబడి పోయిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులను పిలిపించి
మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. సుమారు వంద నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చురుకుగా
సాగడం లేదని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆయనకు నివేదించింది.
Posted by
arjun
at
4:56 AM