December 17, 2012
బీజేపీతో పొత్తు ఉండదు: బాబు
బీజేపీ వంటి మతతత్వ పార్టీతో టీడీపీ కలవబోదని
చంద్ర బాబు ప్రకటించారు. మైనారిటీల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి
ఉన్నదని, కాంగ్రెస్ మాత్రం వారిని ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోందని
ధ్వజమెత్తారు.అల్లీపూర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. 2014 నాటి
పొత్తులూ కత్తులపై స్పందించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు
ఇవ్వాలనేది తమ పార్టీ ప్రణాళికలోని అంశమని, దాన్నే వైఎస్ అమలు చేసే
ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే ముస్లింలకు ఎనిమిది
శాతం కోటా, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, వడ్డీ లేని రుణాల మంజూరు,
ఇమామ్లకు రూ. 5,300 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు.
Posted by
arjun
at
10:29 PM