December 17, 2012

బాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి..

మెట్‌పల్లి/మల్లాపూర్: బాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి... మా కష్టాలు గ ట్టెక్కాలని పలువురు రైతులు అన్నారు. ఆదివారం మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి నుంచి రేగుంట వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా పలు ప్రాంతాల్లో ఆగు తూ పలువురు రైతులు, యువకులు, వి ద్యార్థులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులతో చంద్రబాబు మాటామంతి కలిపారు. పసుపు చేలకు వెళ్లి పంటల ను పరిశీలించారు. మిరప, జొన్న, పసుపు పంటలను పరిశీలించారు. గొర్ల కాపరులతో మాట్లాడారు. ఇలా చంద్రబాబు పలు వర్గాలకు చెంఇన ప్రజలతో పాదయాత్రలో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు వర్గాలకు చెందిన ప్రజలు చంద్రబాబుతో జరిపిన సంభాషణ ఇలా ఉంది...

రేగుంట పసుపు రైతు: సార్ పంట కు పీడసోకింది. దిగుబడి తక్కువగా వ చ్చే ప్రమాదముంది. అధికారులు పట్టించుకుంటలేరు. మమ్మల్ని ఆదుకోవాలి.

చంద్రబాబు: పసుపు ఎన్ని ఎకరాల్లో వేసావు. పెట్టుబడి ఎంతయింది. ఇంకా సమస్యలేంటి.

రైతు: మూడెఎకరాల్లో పసుపు వే సాను. లక్షకు పైగా పెట్టుబడి దాటింది. మందుల ఖర్చు ఎక్కువయ్యింది.

చంద్రబాబు: దిక్కుమాలిన ప్రభు త్వం రైతులను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ హయాంలోనే అన్నదాత అష్టకష్టాల పాలవుతున్నాడు.

రైతు: మీరు మళ్లీ ముఖ్యమంత్రి కా వాలి.. మా కష్టాలు గట్టెక్కించాలి.

చంద్రబాబు: రైతన్న కష్టాలు తీర్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాను. పసుపుకు ప్రత్యేక బోర్డుఏర్పాటు చేసిన మద్దతు ధర అందించాలి.

గొర్లకాపరి: సార్ గొర్లు చనిపోతున్నా యి.. బీమా సొమ్ము అందడం లేదు.. ఎ వరికి చెప్పాలో తెలియడం లేదు.

చంద్రబాబు: టీడీపీ ప్రభుత్వం వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. గొర్రెలకు బీమా అందిస్తాము. గొర్ల పెం పకానికి ఉచితంగా స్థలం కేటాయిస్తాను.

స్వయం సహాయ సంఘ మహిళ: సార్ బ్యాంకులో 50 వేల అప్పు తీసుకున్నాను. వడ్డీకి వడ్డీ వేసి ఇప్పుడు అప్పు లక్షకు పెరిగింది. కట్టే పరిస్థితిలేదు. ఉరి వేసుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు.

చంద్రబాబు: మీ సమస్యలు తెలుసుకున్నా పరిష్కారానికి కృషి చేస్తాను.

వృద్ధుడు: సార్ నా వయస్సు 80 సంవత్సరాలు, అధికారుల చుట్టు ఎన్నిసార్లు తిరిగినా కనీసం పింఛను అంద డం లేదు. మీరే ఆదుకోవాలి బాంఛెన్.

చంద్రబాబు: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధుల సంక్షేమానికి ప్ర త్యేక చర్యలు తీసుకొని అర్హులైన వృద్ధులందరికి పింఛన్లు అందిస్తాను.

మానసిక వికలాంగుని తల్లిదండ్రు లు: సార్ మా బాబు మానసిక వికలాంగుడు, ప్రభుత్వం సరైన విధంగా ఆదుకోవడం లేదు, కష్టాలు ఎదుర్కొంటున్నాము కనికరించండి.

చంద్రబాబు: వికలాంగుల మంత్రి త్వ శాఖను టీడీపీ ప్రభుత్వం వస్తే ఏ ర్పాటు చేస్తాను. వికలాంగులను ఆదుకోవడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తా ము. అన్ని రకాల వికలాంగులను ఆదుకుంటాము.

మెట్‌పల్లి/మల్లాపూర్: బాగా చదువుకోవాలి.. పైకి రావాలి.. అమ్మానాన్నలకు పేరు తీసుకురావాలి.. అంటూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విద్యార్థుల కు సూచనలందించారు. ఆదివారం మ ల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి, రే గుంటలలో నిర్వహించిన వస్తున్నా మీ కోసం పాదయాత్రలో పలువురు విద్యార్థులతో బాబు మాటామంతి నిర్వహించారు. విద్యార్థులకు సమస్యల పరిష్కారంపై భరోసా అందించారు. చంద్రబా బు నిర్వహించిన మాటామంతీ ఇలా ఉంది...

విద్యార్థులు: సార్ మాకు ఉపకార వే తనాలు వస్తలేవు.. పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కావడం లేదు, మీరే పరిష్కరించాలి.

చంద్రబాబు: మీ సమస్యల పరిష్కారానికి సహకరిస్తాను. మీరు బాగా చదువుకోవాలి... పైకి రావాలి.. అమ్మానాన్నలకు పేరు తీసుకురావాలి.

విద్యార్థులు: సార్ మా పాఠశాలకు వెళ్లే రహదారి సరిగా లేదు, పీఈటీ సా ర్ లేడు

చంద్రబాబు: ఇదే పరిస్థితి పలు ప్రాంతాల్లో ఉంది. పరిష్కారానికి కృషి చేస్తాను. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాను.

విద్యార్థులు: మీ హయాంలోనే మం చిగా ఉండె. ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు

చంద్రబాబు: నవ్వుతూ.. మీరు చెప్పి న సమస్యలు దృష్టిలో ఉంచుకుంటా ను.అవసరమైన సహకారాన్నందిస్తాను.

విద్యార్థులు: మాకు యూనిఫాము లు ఇంతవరకివ్వలే... మరుగుదొడ్లు లే వు.. సైకిళ్లు ఇవ్వలేరు

చంద్రబాబు: మీ సమస్యలన్నింటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. పరిష్కారమవుతాయి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల సమస్యలు తీరుస్తాను..