December 19, 2012

రాజన్న సన్నిధిలో టీడీపీ నాయకుల పూజలు

వేములవాడ : టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కరీంనగర్ జిల్లాలో చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర విజయవంతం కావడంతో పాటు ఆయన ఆరోగ్యం బాగుండాలని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో టిడిపి నేతలు ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల మండలం కిష్టంపేట గ్రామంలో చేపట్టిన పాదయాత్రలో స్వామివారి ప్రసాదం, కండువా, మెమోంటోను చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ గండ్ర నళిని, జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ.నసీర్, తూపుకారి సత్తయ్య జిల్లా కమిటీ మెంబర్ నందిపేట సుదర్శన్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రకు తరలిన నేతలు

వేములవాడ : టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రకు వేములవాడ నుండి టిడిపి నేతలు తరలివెళ్లారు. జగిత్యాల మండలం కిష్టంపేట నుండి జగిత్యాల, సుమారు 12 కిలోమీటర్ల వరకు చంద్రబాబుతో పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదయాత్ర విజయ వంతానికి కృష చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొలాస నరేందర్, పీర్ మహ్మద్, సుదర్శన్‌యాదవ్, పులి రాంబాబుగౌడ్, ఉమేందర్, రమణయాదవ్, నాగుల కృష్ణమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.