December 19, 2012
21న కరీంనగర్కు బాబు పాదయాత్ర.....
కరీంనగర్ టౌన్/రూరల్ : తెలుగుదే శం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నా యుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పా
దయాత్ర ఈ నెల 21న రాత్రి కరీంనగర్ మండలం కొత్తపల్లి శివారుకు చేరనున్న ది.
అక్కడే రాత్రి బస చేయనున్నారు. 22న ఉదయం కొత్తపల్లి అంబేద్కర్ వి గ్రహం
వద్ద బహిరంగసభ జరగనున్న ది. రెండు రోజుల పాటు కరీంనగర్ అ సెంబ్లీ
నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా స్థానిక
ఎమ్మెల్యే గంగు ల కమలాకర్ మంగళవారం రూట్మ్యాప్ను పరిశీలించారు. పార్టీ
మండల అ ధ్యక్షుడు కాసెట్టి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు గుగ్గిళ్లపు రమేశ్,
జిల్లా ప్రధాన కా ర్యదర్శి వాసాల రమేశ్తో కలిసి ఆయా మార్గాల మీదుగా
పరిశీలించారు. అలా గే చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేసేందుకు 19వ తేదీ
ఉదయం నగరంలోని మినీ వరలక్ష్మి గార్డెన్సులో నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పా
టు చేశారు.
ఈ సందర్భంగా గ్రామాల వారీగా నేతలకు పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను అప్పగించ డం జరుగుతుందని తెలిపారు. 21వ తే ది పదిగంటల ప్రాతంలో కరీంనగర్ ని యోజకవర్గంలోకి చేరుకుంటుందని, అక్కడే బస చేసకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 22వ తేది ఉదయం 10.30నిమిషాలకు పాదయాత్ర ప్రారంభమై గ్రామంలోని పద్శశాలి సంఘం చౌరస్తా నుంచి బస్టాండ్, చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ స భ ఉంటుందని తెలిపారు. సభ అనంత రం గ్రామపరిధిలోని అల్ఫోర్స్ ఈటె క్నో పాఠశాలలో సివి రామన్ జ యంతి ఉత్సవా ల్లో పరిచయ కా ర్యక్రమాన్ని ము గించుకుని రేకుర్తి మీదుగా సీరాంపూర్ నుంచి ఆరపెల్లి గ్రామం తీగలగుట్టపల్లి గ్రా మానికి చేరుకుని బస్స్టేజ్ వద్ద రో డ్షోలో పాల్గొంటాడు.
రోడ్ షో అనంతరం సాయంత్రం పాదయాత్రలో పా ల్గొంటరని, తీగటగుట్ట పల్లె మీదుగా వ ల్లంపహాడ్, ఎలబోతారం క్రాస్ రోడ్డు నుంచి నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఆసుపత్రి మీదుగా జూబ్లీనగర్ ప్రజల తో కలుస్తూ చామనపెల్లి శివారులో ఏ ర్పాటు చేసిన బస చేసూ ప్రాంతానికి చే రుకుని రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. 23న ఉదయం 10.30గంటలకు 28వ తేదిన తెలంగాణ కోసం జరిగే అఖిలప క్ష సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశం అనంతరం పాదయాత్ర చామనపెల్లి, దుబ్బపల్లి, చెర్లబూత్కూర్ మీదుగా మొగ్దుంపూర్ ఆతరువాత గర్రెపల్లి గ్రా మానికి పాదయాత్ర సాగుతుందని తెలిపారు.
ఈ పాదయాత్రలో కొత్తపల్లి గ్రామంలోని చేనేత కార్మికులకు భరోసా ఇస్తాడని, వారి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలపై డిక్లరేషన్ ఇస్తాడని తెలిపా రు. ఈ యాత్రను విజయవంతం చే యాలని కోరారు. కరీంనగర్ నియోజక వర్గంలో జరిగే పాదయాత్రకు టీడీపీ తెలంగాణ పోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఆయన వెంట నాయకులు జంగిలి సాగర్, వాడె మధుసూదన్రెడ్డి, రుద్ర రాజు, బూస రాములు, జేరిపోతుల మొండయ్య, బోగ రవీందర్, శ్రీ«ధర్, ఆర్ఐ ఎండి ఖాజ, కార్యదర్శి సత్యనారాయణ, రూరల్ సీఐ కమలాకర్రెడ్డిలు ఉన్నారు.
Posted by
arjun
at
2:41 AM