December 8, 2012
బాబు పాదయాత్రకు విశేష స్పందన...
కుంటాల/భైంసా/లోకేశ్వరం/ముథోల్:
వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా మూడవ రోజైన శనివారం భైంసా నుంచి
కుంటాల మం డం వరకు ప్రజలు చంద్రబాబుకు అ డుగడుగున నీరాజనం పలికారు. మీ రు
మళ్లీ అధికారంలోకి రావాలి.. మా కష్టాలు తీర్చాలి అని వేడుకున్నారు. రెండు
రోజుల పాదయాత్రతో పోలిస్తే శనివారం పాదయాత్రకు ప్రజలు, కా ర్యకర్తలు భారీగా
తరలివచ్చారు. ఎక్క డ చూసినా 61వ జాతీయ రహదారి జనసంద్రమైంది.
ప్రజాస్పందనను చూసిన బాబు ఉత్సాహంగా నడుస్తూ అవకాశం చిక్కినప్పుడూ ప్రజలతో
ము చ్చటిస్తూ ముందుకు సాగారు.
మాటే గాం సమీపంలో వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. తమకు కూలీ గిట్టుబాటు అవుతలేదని చంద్రబాబుతో వా రు వాపోయారు. నిత్యవసర ధరలు పె రిగాయని ఏమి తినేటట్లు లేదని తెలిపారు. షిర్డికి పాదయాత్రగా వెళ్తున్న సా యిభక్తులు చంద్రబాబును కలిసి మీ లాంటి వ్యక్తే రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తే మంచి జరుగుతుందని అన్నారు. మరికొంతమంది వృద్ధులు తమకు పింఛన్లు రావడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. వీటిపై స్పందించిన చంద్రబాబునాయుడు టీడీపీని ఆదరించి గెలిపిస్తే ఇంటి పెద్దకొడుకుగా మీ కష్టాలన్నీ తీరుస్తానన్నారు.
చంద్రబాబు పాదయాత్రపైఇంటెలీజెన్స్ ఆరా...జిల్లాలో మూడు రోజులుగా కొనసాగుతున్న వస్తున్నా మీకోసం చంద్రబాబు పాదయాత్రపై ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. చంద్రబాబు ప్ర సంగించిన సమయంలో ప్రజాస్పందన ఎలా ఉంది.జనసమీకరణ తదితర అం శాలపై ఆరా తీశారు. చంద్రబాబు పై ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకు నే ప్రయత్నం కూడా చేశారు.
Posted by
arjun
at
10:26 PM