December 8, 2012

అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు సతీమణి

బాసర: బాసర సరస్వతీ అమ్మవారిని శనివారం టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దర్శించుకున్నారు. జిల్లా లో సాగుతున్న వస్తున్నా మీ కోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసేందుకు హైదరాబాద్ నుంచి భైంసాకు వెళ్తూ మార్గమధ్యంలో ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆ లయ పండితులు మంగళ వాయ్యిదాలతో ఘనస్వాగతం పలికారు. సరస్వతీదేవిని దర్శించుకుని ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని అందజేసి పండితులు ఆమెను ఆశీర్వాదించారు