December 3, 2012

రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు సాహసం చేస్తున్నారు: మోత్కుపల్లి

రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు సాహసం చేస్తున్నారని, వ స్తున్నా మీ కోసం యాత్ర సాహస యా త్ర అని టీడీఎల్‌పీ భేటీలో సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింలు అ న్నారు. టీడీఎల్‌పీ సమావేశంలో పలువురు సీనియర్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకున్నా రు. సాలంపాడ్‌లో నిర్వహించిన టీడీఎల్‌పీ భేటీలో పలువురు సీనియర్ ఎ మ్మెల్యేలు బాబు యాత్ర మన అందరి కి ఆదర్శనమన్నారు. మోత్కుపల్లి నర్సి ంలు మాట్లాడుతూ 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు యాత్రతో పార్టీ పరిస్థితి మెరుగు పడిందన్నారు. ఎన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా వీరు ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమన్నారు.

శాసన మండలి ఫ్లోర్ లీడర్ దాడి వీరభద్రరావు మాట్లాడు తూ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టడం లేదని కొం దరు నేతలు హైదరాబాద్ పార్టీ కార్యాలయానికే పరిమితం అవుతున్నారన్నా రు. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే సుమ న్ రాథోడ్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రెండు మండలాల్లో పాదయాత్ర పూర్తి చేశానని, ఇంకా రెండు మండలాల్లో మీ యాత్ర వచ్చేలోపు పూర్తి చేస్తానన్నారు. ప్రజలకు రుణాలు చెల్లించొదన్నారు. కరీంనగర్ జిల్లా పా ర్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ పాదయాత్రతో క్యాడర్‌లో ఉత్సాహం పెరిగిందని, కరె ంటు సరఫరా అస్తవ్యస్తంగా మారింద ని, ట్రాన్స్‌ఫార్మర్లు నెలలతరబడి ఇ వ్వడం లేదని చంద్రబాబుకు స్పష్టం చే శారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎ మ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడతూ బీసీ, మైనార్టీ, మహిళ డిక్లరేషన్లు ఎం తో ఉపయోగకరంగా ఉన్నాయని, ఎ స్సీ వర్గీకరణ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం క్షేత్ర స్థాయిలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు విన్నబాబు క్షేత్ర స్థాయిలో అందరు పాదయాత్రలు చేయాలని, అవినీతిని ఎండగట్టాలని, వైఎస్సార్‌సీపీ, టీఆర్ఎస్ కు ట్రలను ప్రజలకు తెలియజేయాలన్నా రు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండవ వెంకటేశ్వర్‌రావు, అన్నపూర్ణమ్మ, అరికెల నర్సారెడ్డి, వీజీగౌడ్, హన్మంత్‌షిండే, సీతక్క, రేవంత్‌రెడ్డి, దూలిపాల నరేంద్ర, రామారావు పాల్గొన్నారు.