November 17, 2012

ఆదివారం పాదయాత్రలో చంద్రబాబుతో పాటు భువనేశ్వరి!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర లో ఆదివారం నాడు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కూడా పాల్గొనవచ్చని కధనాలు వస్తున్నాయి. ఇది గమనించదగిన పరిణామమే. కుమారుడు లోకేష్ హిందూపూర్ లో పాదయాత్ర ఆరంభమైన తర్వాత, అలాగే, ఆయా సందర్భాలలలో పాదయాత్రలలో పాల్గొన్నారు. కాని భువనేశ్వరి మాత్రం చంద్రబాబును అప్పడప్పుడు కలిసి మాట్లాడి పాదయాత్రలో పాల్గొనకుండా వెళ్లిపోయేవారు. అంటే కేవలం ఆమె చంద్రబాబు యోగక్షేమాలకే పరిమితం అయ్యారన్నమాట.ఆదివారం మాత్రం భువనేశ్వరి కూడా పాదయాత్రలో పాల్గొంటారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుతో పాటు భువనేశ్వరి సుమారు పదహారు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయవచ్చు.ఇందుకోసం పార్టీ నాయకులు స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత షర్మిల పాదయాత్ర చేస్తున్న నేపధ్యంలో భువనేశ్వరి పాదయాత్రకు సిద్దం అవడం విశేషం. అయితే ఇప్పుడు ఒకే రోజుకు పాదయాత్ర చేసినా, ఆ తర్వాత ఆమె కూడా మరికొన్ని రోజులు అప్పుడప్పుడు పాదయాత్రలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తారని భావించవచ్చు. ఇది టిడిపిలోని ఇతర నాయకులకు, పార్టీ శ్రేణులకు ఒక సందేశం ఇచ్చినట్లు కూడా అవుతుంది.
No comments :

No comments :