October 17, 2012

నేటి పాదయాత్ర షెడ్యూల్ 18.10.2012

 కర్నూలు జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర గురువారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. గురువారం ఉదయం ఆదోని మండలం ఆరెకల్లు గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమై కొటేకల్ టర్నింగ్, బసాపురం, దేవిబెట్ట, కొటేకల్ స్టేజి మీదుగా కొనసాగుతుంది.

చెన్నాపురం 10వ కి.మీ రాయి వద్ద గొర్రెల కాపరులతో ముచ్చట్లు, బోడబండలో పంటపొలాల్లో రైతులతో సంభాషణ, గ్రామ సమస్యలు, మహిళలతో చర్చలు ఉంటాయి. అనంతరం నక్కలమిట్ట గ్రామంలో ప్రజలతో చర్చలు, బనవాసి ఫారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అనంతరం నలందా బీఈడీ కళాశాల దగ్గర వడ్డెర సంఘంతో కలయిక ఉంటుంది.

వెంకటగిరి, హనుమాపురం గ్రామస్థులతో, మహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కళాశాల దగ్గర కళాశాల సమస్యలు, నిరుద్యోగ బీఈడీ అభ్యర్థులతో సమావేశం ఉంటుంది. ఆతర్వాత ఎమ్మిగనూరు పట్టణంలోకి ప్రవేశిస్తారు. శివథియేటర్ వద్ద, బస్టాండ్ వద్ద, సోమప్ప సర్కిల్ వద్ద, ప్రసంగిస్తారు. అనంతరం వివిశ వర్గాల వారు చంద్రబాబును సన్మానం చేస్తారు. రాత్రికి సమీరా రైస్‌మిల్లు చేరుకుని అక్కడ బస చేస్తారు.
No comments :

No comments :