August 8, 2013

టిడిపి ఎమ్.పి ల సస్పెండ్?

పార్లమెంటులో సమైక్య రాష్ట్ర నినాదాలు గురువారం కూడా మార్మోగాయి.రాజ్యసభలో సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆందోళన చేయడంతో సభ గంటన్నర సేపు వాయిదా పడింది.దీంతో రాజ్యసభలో అడ్డుతగులుతున్న సభ్యులపై చర్య తీసుకునే అవకాశం కనబడుతోంది.తెలుగుదేశం సభ్యులు సి.ఎమ్.రమేష్,సుజనా చౌదరిలతో సహా ఇరవై మంది సభ్యుల పేర్లను రాజ్యసభ అదికారులు ప్రస్తావిస్తూ నోటీసు జారీ చేశారు.ఇరవైమంది సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని వారు పేర్కొన్నారు.అంటే ఇతర కారణాలతో ఇతర ఎమ్.పిలు అడ్డు తగులుతుంటే టిడిపి ఎమ్.పిలు సమైక్య రాష్ట్ర ఆందోళన చేస్తున్నారు.ఈ నేపధ్యంలో వీరి పేర్లు నోటీసులలో చోటు చేసుకున్నాయి.కాగా లోక్ సభలో టిడిపి సభ్యులు వెల్ లోకి దూసుకు వెళ్లగా, కాంగ్రెస్ ఎమ్.పిలు తమ సీట్లలో నిలబడి నిరసన తెలుపుతున్నారు.