July 10, 2013
మోత్కుపల్లి హత్యకు కేసీఆర్ కుట్ర: కేఎస్ రత్నం
టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు హత్యకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుట్ర పన్నారనడానికి ఎ న్నో బలమైన కారణాలున్నాయని ఆ పార్టీ శాసన సభ్యుడు కేఎస్ రత్నం అన్నారు. మంగళవారం ఎన్టీ ఆర్భవన్లో కేఎస్ రత్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచనలకు విరుద్దంగా ఎవరు మాట్లాడిన వారిపై దాడులు చేయించిన సంఘటనలు గతంలో ఎన్నో ఉన్నాయన్నారు. మంద కృష్ణ మాదిగ, రవీంద్రనాయక్, గద్దర్, తాజాగా చింతస్వామిపై కేసీఆర్ తన అనుచరలతో దాడి చేయించారన్నారు. అలాగే మోత్కుపల్లి హత్యకు కుట్ర చేసి ఉండవచ్చునని ఆరోపించారు. దళిత బడుగు, బలహీనవర్గాల నేతలంటే కేసీఆర్కు కంటగింపుగా మారిందని విరుచుపడ్డారు. తెలంగాణవాదం కేసీఆర్ సొత్తు కాదన్నారు.
Posted by
arjun
at
5:52 AM