July 10, 2013
తెలుగు విద్యార్దులకు అన్యాయం
40 ఏళ్ల విధానాన్ని ఇప్పుడెందుకు మార్చారు
తెలుగు విద్యార్థులను నిలువరించేందుకే ఈ కు్ట్ర
మన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే
ముఖ్యమంత్రి, కేంద్ర మంు్తల్రు ఏం చేస్తున్నారు
కేంద్రాన్ని పార్లమెంట్లో నిలదీస్తాం
అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఐఐటీలలో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ
(అడ్వాన్స్డ్-2013) ర్యాంకుల ఖరారులో అనుసరించిన టాప్ ట్వంటీ పర్సంటైల్
విధా నాన్ని పూర్తి లోపభూయిష్టంగా రూపొందించారని తెలుగు దేశం పార్టీ అధినేత
నారా చంద్రబాబు నాయుడు మండిప డ్డారు. నార్మలైజెడ్ పర్సంటైల్ విధానం వల్ల
తెలుగు విద్యా ర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్సంటైల్ విధానం వల్ల రాష్ట్రానికి చెందిన ఎస్టీ విద్యార్థుల కంటే ఇతర
రాష్ట్రాల్లోని జనరల్ కేటగిరి విద్యార్థులు ఎక్కువగా ప్రయోజనం
పొందుతున్నారన్నారు. మంగళవారం చంద్రబాబు తన నివాసంలో విలేకరుల సమావేశంలో
మాట్లాడుతూ ఈ విధానం వల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా
నష్టపోతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. ఈ విధానం వల్ల మహారాష్ట్రంలో 68
శాతం ఇంటర్ మార్కులు సాధించిన విద్యార్థులు, త్రిపురలో 53 శాతం మార్కులు
సాధించిన విద్యార్థు లు, రాష్ట్రంలో 91.8శాతం మార్కులు సాధించిన
విద్యార్థులతో సమానమవుతున్నారని వివరించారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన కటాఫ్
మార్కులకు, ఐఐ టీ (ఢిల్లీ) ప్రకటించిన కటాఫ్ మార్కులకు ఏమాత్రం పొంతన
లేదన్నారు. సీబీఎస్ఈ సూచించినట్లుగా కటాఫ్ మార్కులిచ్చామని ఇంటర్ బోర్డు
అధికారులు చెబుతుంటే, సీబీఎస్ఈకి, ఐఐటీ(ఢిల్లీ)కే సమన్వయం లేకుండా పోయిందని
చంద్రబాబు ఎద్దేవా చేశారు. సీబీఎస్ఈ, ఐఐటీ మధ్య సమన్వయలోపం తెలుగు విద్యా
ర్థులకు శాపంగా పరిణమించిందన్నారు.
40 ఏళ్లుగా కొన సాగిస్తున్న
విధానాన్ని ఇప్పుడు ఎందుకు మార్చాల్సివచ్చిం దని చంద్రబాబు ప్రశ్నించారు.
విద్యార్థులకుగానీ తల్లి దండ్రులకుగానీ ముందుగా తెలియపరచకుండా చివరి
నిమిషంలో నార్మలైజ్డ్ పర్సంటైల్ విధానాన్ని అమలులోకి తెచ్చారని
ధ్వజమెత్తారు. అఖిల భారత సర్వీసెస్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఐయంలకు
జరిగే పోటీ పరీక్షలకు ఎటువంటి పర్సంటైల్ విధానం లేదని ఆయన గుర్తు చేశారు.
ఐఐటీలో మాత్రం పర్సంటైల్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక అంతర్యమేమిటనీ
ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కువ సీట్లు పొందుతున్నారనే
అక్కసుతోనే 40 ఏళ్లుగా సాఫీగా కొనసాగుతున్న విధానా న్ని కాదనీ కొత్త
విధానాన్ని ప్రవేశపెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం
ఇష్టారాజ్యంగా తీసుకున్న దుందుడుకు విధానాల వల్ల విద్యార్థులందరూ నష్టపోతు
న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ముందుగానే ఈ విధానంపై రాష్ట్ర
ప్రభుత్వాన్ని సంప్రదించినట్లయితే ఇప్పుడు విద్యార్థులకు జరుగుతున్న
అన్యాయంపై ఎం దుకు మౌనం వహిస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పా లన్నారు.
ఐఐటీ ప్రవేశాలకు అర్హత సాధించడంతో అనేక మంది విద్యార్థులు ఇతర ఇంజనీరింగ్
కాలేజీలలో దర ఖాస్తు చేయలేదన్నారు. కపిల్ సిబాల్ మానవ వనరుల మంత్రిగా
ఉన్నప్పుడు ఉత్తరాది కోటరి పన్నిన పన్నాగానికి ఈ రోజు తెలుగు విద్యార్థులు
బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులకు అన్యాయం జరు
గుతుంటే కేంద్రమంత్రులందరూ ఏమీ చేస్తున్నారని నిలదీశారు. మన రాష్ట్ర
విద్యార్థుల భవిష్యత్తు గొడ్డలిపె ట్టుగా మారిన పర్సంటైల్ విధానాన్ని
కేంద్ర మానవవన రుల శాఖ మంత్రిగా పల్లంరాజు అడ్డుకోకపోవడం శోచ నీయమన్నారు.
పర్సంటైల్ విధానంపై కేంద్రాన్ని పార్లమెం ట్లో నిలదీస్తామని, అవసరమయితే
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చంద్రబాబు వివరించారు.టీడీపీ విద్యకు అధిక
ప్రాధాన్యత ఇవ్వడం వల్లే జాతీయస్థాయి పోటీల్లో తెలుగు విద్యార్థులు అత్యధిక
సీట్లు పొందుతున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇంజనీరింగ్, ఐఐటీ, లా,
మేనేజ్మంట్ మొదలైన కాలేజీలు ప్రభుత్వ, ప్రైవేట్రంగాల్లో పెద్ద ఎత్తున
ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రా నికి కేంద్రం అన్ని
విధాలుగా అన్యాయం చేస్తున్న ముఖ్య మంత్రి, కేంద్రమంత్రులు నిమ్మకు
నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నారని శివాలెత్తారు. రాష్ట్ర విభజనపై అంశంపై
స్పందించడానికి చంద్రబాబు నిరాకరించారు.
Posted by
arjun
at
5:55 AM