June 8, 2013

విప్ ధిక్కార ఎమ్మెల్యేలపై వేటుకు సిద్ధం

హైదరాబాద్ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన తొమ్మిది మంది కాంగ్రెస్‌, ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హతా వేటుకు రంగం సిద్ధమైంది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మార్చి15న అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత దాదాపు రెండున్నర నెలల పాటు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ విచారణ నిర్వహించారు. ఈ రోజు సాయంత్రంలోగా నిర్ణయాన్ని స్పీకర్‌ కార్యాలయం ప్రకటించే అవకాశం వుంది.