June 8, 2013

సిఎం ప్రచార ఆర్బాటం: టిడిపి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడుతున్నారు. టిడిపి నేతలు తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ కిరణ్ ముఖం చూడలేక రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. ప్రచార ఆర్భాటానికి చేస్తున్న ఖర్చులో పది పైసలు కూడా సంక్షేమ కార్యక్రమాలకు పెట్టడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రచార ఖర్చుల వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందన్నారు. వ్యవసాయ పనిముట్ల వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.