June 11, 2013

'నాగం వెళ్లి, అద్వానీని పంపించారు'


హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో మంగళవారం భారతీయ జనతా పార్టీకి చెందిన నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వర రావు, అశోక గజపతి రాజుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. తుమ్మల, అశోకలు ఎదురైనప్పుడు నాగం వారితో.. తనను టిడిపి నుండి సస్పెండ్ చేసి బయటకు గెంటివేశారని ఆయన అన్నారు. దానికి వారు స్పందించారు. నాగం జనార్ధన్ వంటి నేతలను తాము బయటకు పంపివేయగలమా? అని ప్రశ్నించారు. నాగం బిజెపిలో చేరి అద్వానీనే బయటకు పంపించారు.. అలాంటి వ్యక్తిని ఎవరైనా టిడిపి నుండి బయటకు పంపగలరా? అని చమత్కరించారు. దీంతో వారి మధ్య కాసేపు నవ్వులు విరబూశాయి.