June 11, 2013
రైతు సమస్యలపై రాజీలేని పోరు: బాబు
హైదరాబాద్ : రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని టీడీపీ
అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ
టీడీపీ బుధవారం గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ధర్నాలో పాల్గొన్న
చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలయిందని ఆవేదన వ్యక్తం
చేశారు. కౌలు రైతులకు రుణాలు అందటం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో
23వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు.
Posted by
arjun
at
9:37 PM