May 22, 2013

నేను కార్పొరేట్ల గుప్పిట్లో ఉన్నానా!


వాళ్ల గుప్పిట్లో నేనున్నానా!..అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు కార్పొరేట్ల గుప్పిట్లో చంద్రబాబు ఉన్నారని ఒక పత్రిక రాసిన కధనంపై ఆయన మండిపడ్డారు.నేను కొత్తగా రాజకీయాలలోకి వచ్చానా?వారు వచ్చారా?ఒకే కొందరు స్థితిమంతులు కూడా రాజకీయాలలోకి సేవ చేయడానికి రావచ్చు. వారు ఉంటారు.పార్టీలో మిగిలినవారు కూడా ఉంటారు.అంతమాత్రాన వారి గుప్పిట్లో ఉంటానా అని ఆయన ప్రశ్నించారు.కావాలని ఇలా ప్రచారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు.