May 3, 2013

గొప్పల సీఎం..పోస్టులు భర్తీ చేయని వైనం: నర్సిరెడ్డి

అధికారంలోకి రాగానే 2.50 లక్షల ఉద్యోగాలనిస్తామని, 70 వేల బీసీ, 50 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని, ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు తొమ్మిదేళ్ళు గడుస్తున్నప్పటికీ వాటిని అమలు చేయకపోవడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం గొప్పలు చెప్పడమే కానీ ఏదీ ఆచరణలోకి రావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులను ఆశలపల్లకీల్లో ఉంచి తాము మాత్రం అధికార పల్లకిలో ఊరేగాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.